లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 330f జిల్లా గవర్నర్ లయన్ కన్నా పరశురాం జన్మదిన సందర్భంగా ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు బండారుపల్లి లోని ఇటుక బట్టి కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు లయన్స్ క్లబ్ సభ్యులు, ఇటుక బట్టి క్వారీ కార్మికులు వారి పిల్లలతో మధ్య కన్నా పరుశురాం బర్త్ డే కేక్ కట్ చేశారు. అనంతరం కార్మికులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ములుగు లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ నిరుపేదలకు అన్నదానం చేయడం, అవసరార్థులను ఆదుకోవడం లయన్స్ క్లబ్ ల ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు లయన్స్ క్లబ్ అధ్యక్షులు చుంచు రమేష్, కోశాధికారి మెరుగు రమేష్ క్లబ్ పూర్వ అధ్యక్షులు కార్యదర్శులు సానికొమ్ము రవీందర్ రెడ్డి, కొండి సాంబశివ లయన్ మాట్ల బద్రి మరియు లయన్స్ క్లబ్ సభ్యులు ఇటుక బట్టి క్వారీ కార్మికులు పాల్గొన్నారు.