40.2 C
Hyderabad
April 29, 2024 16: 08 PM
Slider నల్గొండ

చిల్లర రాజకీయాలకు భయపడను: ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు

#raghu

శివయ్య ఆశీస్సులతో హుజూర్ నగర్  నుండి పోటీ చేస్తున్నా

చిల్లర రాజకీయాలకు తాను భయపడనని రాబోయే రోజుల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తానని మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన పిల్లుట్ల రఘు అన్నారు. నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం తన సొంత గ్రామానికి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని చిల్లేపల్లి టోల్గేట్ నుండి అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. గ్రామంలో శివాలయ స్వామిని సందర్శించుకొని గ్రామంలో అడుగుపెడుతున్న సందర్భంగా అభిమానులు రోడ్ షోనిర్వహించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పిల్లుట్ల రఘ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని,పిలుట్ల రఘు అనే వ్యక్తి ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని అన్నారు.స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేస్తున్న తనపై కొంతమంది కుట్రలు చేయడం సరైనది కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

ఇంటర్వెల్: కరోనా భయంతో బయటకు రాని బడా హీరోలు

Satyam NEWS

ఉపాధ్యాయులు సులభమైన పదజాలం ఉపయోగించాలి

Satyam NEWS

కరోనా నివారణ కోసం హైపో క్లోరైడ్ ద్రావణం  పిచికారి

Satyam NEWS

Leave a Comment