పేదప్రజలకు అండగా ఉంటామని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, సత్యసాయి ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన కమలానగర్ స్ఫూర్తి క్లబ్ అధ్యక్షుడు పజ్జురి మణిపాల్ రెడ్డి అన్నారు.
కమలానగర్ స్ఫూర్తి క్లబ్ అధ్యక్షుడు మణిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పదిమంది పేద మహిళలకు వంట సరుకులు పంపిణీ చేశారు. డిస్ట్రిక్టు 320సి గవర్నర్ ఆవుల గోపాల్ రావు ,వైస్ డిస్ట్రిక్టు గవర్నర్ వెంకట్ నారాయణ రెడ్డి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హరీష్ రెడ్డి, సత్యసాయి ట్రెస్ట్ మెంబర్ సుబ్రమణ్యం మనోహర్ రెడ్డి ,రామతులషి రాజేందర్ రెడ్డి, లయన్ రామచారి, మిత్రులు పాల్గొన్నారు.