మాజీ ఉప ప్రధాని, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అద్వానీ 95వ జన్మదినోత్సవాన్ని కొల్లాపూర్ మున్సిపాలిటీలోని వృద్ధాశ్రమంలో బ్రెడ్ ప్యాకెట్లు, పండ్లు పంచి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ మండల అధ్యక్షులు తమటం సాయికృష్ణ గౌడ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషించి దేశంలో రెండు ఎంపీ స్థానాల నుంచి 300 ఎంపీ స్థానాలను గెలవడంలో LK అద్వానీ దే ప్రధాన పాత్ర అని అన్నారు.
ఆయన కృషి వల్లనే ఈరోజు బిజెపి దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిందని అన్నారు. అద్వానీ పై ప్రత్యర్థి పార్టీలు కేసులు పెట్టి అవమానించినా ధైర్యంగా ఎదుర్కొని దేశవ్యాప్తంగా పర్యటన చేసి కార్యకర్తలకు భరోసా కల్పించిన ఉక్కుమనిషి అద్వానీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ సమయంలో తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించినా బెదరకుండా ధైర్యంగా నిలబడి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కొట్లాడిన మహానుభావుడు అద్వానీ అన్నారు.
జీవితమంతా ఏమీ ఆశించకుండా సిద్దాంతానికి కట్టుబడి బీజేపీ ని అత్యున్నత స్థానం లో నిలిపిన లాల్ కృష్ణ అద్వానీ ఆయురారోగ్యాలతో జీవించాలని వారి జన్మదినం సందర్భంగా వృధ్ద మహిళలతో కలిసి పుట్టిన రోజు జరుపుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలాల్ శివుడు, సందు రమేష్, గణమోని ఎల్లయ్య, కేతూరి నారాయణ, పరమేష్, చంద్రశేఖర్ రావు, శివ తదితరులు పాల్గొన్నారు.