38.2 C
Hyderabad
May 3, 2024 20: 05 PM
Slider వరంగల్

రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలి

#kisan congress

ఏకకాలంలో రుణమాఫీ చేయాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు  

మంగళవారం  ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలసమావేశం లో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులను నట్టేట ముంచిన పరిస్థితి ఈ రాష్ట్రంలోకొనసాగుతుందని ఆయన అన్నారు. 

రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం ఏక కాలంలో  రైతు రుణమాఫీ చేయాలని బ్యాంక్ అధికారులు రైతుల ఖాతాలను హోల్డ్ లో పెట్టి రైతుల ఇబ్బందులు పెట్టడం సబబు కాదని రైతుల ఖాతాలను హోల్డ్ ల నుండి తొలగించక పోతే బ్యాంక్ ఎదుట రైతుల పక్షాన ధర్నా లు ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

ములుగు జిల్లా వ్యాప్తంగా  రైతులకు సకాలం లో ఎరువుల   బస్తాలు అందించే విధంగా వ్యవసాయ అధికారులు అప్రమత్తం గా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు  

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు,తదితరులు పాల్గొన్నారు

Related posts

మున్సిపల్ సమావేశం నిర్వహించాలని ఆందోళన

Satyam NEWS

బొల్లా అసత్య ఆరోపణలు పై త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో సత్య ప్రమాణం

Satyam NEWS

కరోనా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment