33.7 C
Hyderabad
April 30, 2024 01: 28 AM
Slider ముఖ్యంశాలు

ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన రావూరి సాయి అలేఖ్య

#ravurialekhya

ఈరోజు వెలువడిన యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలలో టౌన్ పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్  రావూరి ప్రకాషరావు  కుమార్తె రావూరి సాయి అలేఖ్య  ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యారు. బోనకల్ మండలం ఎల్ గోవిందపురo గ్రామానికి చెందిన  రావూరి సాయి అలేఖ్య చిన్నతనం నుండే ఐపీఎస్ కావాలని పట్టుదలతో తల్లిదండ్రుల సహకారంతో  ఆల్ ఇండియా లెవెల్ లో 938వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యారు.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 1105 ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. గతేడాది మే 28న ప్రిలిమ్స్‌ నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్షను క్లియర్‌ చేసిన వారికి సెప్టెంబర్‌ 15, 16, 17, 23, 24 తేదీల్లో రెండు షిఫ్టుల్లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించి.. డిసెంబర్‌ 8న మెయిన్స్‌ ఫలితాలు విడుదల చేశారు. మెయిన్స్‌లో సత్తా చాటిన వారికి జనవరి 2, ఏప్రిల్‌ 9 మధ్య వివిధ దశల్లో పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలు ప్రకటించారు. ఐపీఎస్ గా సెలెక్ట్ అయినా  రావూరి  సాయి అలేఖ్య కు మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ మధు, టౌన్ ఎస్ఐ సంధ్య మరియు పోలీస్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

Related posts

మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రైవింగ్ లైసెన్సులు రద్దు

Satyam NEWS

సర్ధార్ సర్వాయి పాపన్న స్పూర్తితో రాజ్యాధికారాన్ని చేపట్టాలి

Satyam NEWS

“అందరి గెలుపునకు ఎంపీ ఆదాల రొట్టె”

Bhavani

Leave a Comment