ఆత్మహత్య చేసుకున్న ప్రేమికుల మృతదేహాలు శనివారం ఉదయం కె ఎల్ ఐ రిజర్వాయర్లో తేలాయి. వనపర్తి జిల్లా రేవల్లి మండలం గంగాదేవి పల్లి గ్రామంలో కేల్ఐ రిజర్వాయర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు మూడు రోజుల తర్వాత వారి మృతదేహాలు నీటిలో తేలాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో ని నరేష్ 27 కల్వకుర్తి పట్టణానికి చెందిన కళ్యాణి 17 ఈనెల 13 వ తేదీ నుండి కనిపించకపోవడంతో 18 న కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. వారిరువురు గౌరీ దేవి పల్లి రిజర్వాయర్ వద్దకు వచ్చి అక్కడే తమ బ్యాగు సెల్ ఫోన్లు మరణ ధ్రువీకరణ పత్రాలు వదిలి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రెండు రోజులపాటు పోలీసులు గజ ఈతగాళ్లు అగ్ని మాపక సిబ్బంది శుక్రవారం సాయంత్రం వరకు వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీనితో పలు అనుమానాలు వ్యక్తం కాగా శనివారం తెల్లవారుజామున మృతదేహాలు నీటిపై తేలుతూ ఉన్న విషయాన్ని మత్స్యకారులు గమనించి బయటకు తీశారు. మృతుడు నరేష్ కు ఆరు సంవత్సరాల క్రితమే వివాహమై భార్య ఇద్దరు పిల్లలు ఉండడంతో నరేష్ భార్యకు మృతురాలు సోదరి వరుస కావడంతో రెండు కుటుంబాల వారు వారి వివాహానికి అంగీకరించకపోవడంతో ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. ఈ మేరకు రేవల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
next post