ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కో౦శట పల్లి లో చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన అమృత, శివ హైదరాబాద్ లో బి ఫార్మసీ చదువుతున్నారు. ఇరువురు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పుకునే ధైర్యం చేయలేకపోయారు. తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పే ధైర్యం లేకే ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.