క్రికెటర్ ఎం ఎస్ ధోని ఆసుపత్రిలో చేరనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడిన తర్వాత ఎంఎస్ ధోని మోకాలి గాయం తీవ్రమైంది. పలు పరీక్షల నిమిత్తం ఈ వారం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరనున్నారు. ధోని మోకాలి గాయంతోనే IPL 2023లోకి ప్రవేశించాడు. ఈ 16వ సీజన్లో ధోని మోకాలిచిప్ప ధరించి కనిపించాడు. ఎడమ మోకాలికి కూడా బరువైన పట్టీలు పెట్టుకుని కనిపించాడు.
మోకాలి గాయంతోనే ఆడిన ధోనికి నొప్పి తీవ్రం అయింది. దాంతో ఆయన ఆసుపత్రికి వెళ్లబోతున్నారు. CSK గుజరాత్ టైటాన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత ధోని తన 5వ IPL టైటిల్ను ఎగరేసుకుపోయాడు. ఈ టోర్నమెంట్ తర్వాత ధోని రిటైర్ మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే అందుకు అతను నిరాకరించాడు.తదుపరి ఎడిషన్లో కూడా ఆడాని ధోని నిర్ణయించుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడానికి నాకు ఇదే ఉత్తమ సమయం. కానీ ఈ సంవత్సరం నాకు లభించిన ప్రేమ మరియు ఆప్యాయతతో, వీడ్కోలు చెప్పడం నాకు సులభమైన విషయం. కానీ నాకు కష్టమైన విషయం ఏమిటంటే, మరో తొమ్మిది నెలలు కష్టపడి తదుపరి సీజన్లో తిరిగి రావడం. నేను నిర్ణయించుకోవడానికి ఆరు-ఏడు నెలల సమయం ఉంది. నేను నా అభిమానులను నిరాశపరచను. నేను వారి కోసం మరో సీజన్ ఆడతానని అనుకుంటున్నాను అని అతను చెప్పాడు.