తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా విదేశాలలో కూడా తెలుగు వారిని ఆదుకోవడానికి ప్రవాసులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ కువైట్ లో నేడు వలస కార్మికుల ఆకలి తీర్చారు. మహమ్మారి కరోనా వైరస్ నేపథ్యంలో కువైట్ లో కర్ఫ్యూ అమలులో ఉంది.
భారత్ లో మాదిరిగానే అక్కడ వేలాది మంది వలస కార్మికులు ఈ కర్ఫ్యూ కారణంగా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వలస కార్మికులకు, రోజువారీ కూలీలకు, అభాగ్యులకు భోజనం సమకూర్చాలని మా యూత్ వెల్ఫేరే అసోసియేషన్ నిర్ణయించింది.
ఈ రోజు సుమారు 100 మందికి కువైట్ మాలియ పరిసర ప్రాంతంలో ఆహారం పంపిణీ చేశారు. అదే విధంగా ముర్గాప్ అనే ప్రాంతంలో కూడా 50 మంది సభ్యులకు ఆహార పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం చేసినందుకు మా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అలీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సురేష్, ఖాదర్ వలీ, గౌస్, త్రినాథ్, ముననీర్ తదితరులు నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు.