ఆరు నెలల్లో సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దనున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. రాష్ట్రంలో నిరక్షరాస్యుల జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలిపిన ఆయన.. నిరక్షరాస్యుల జాబితా సిద్ధం చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.
దేశంలోని మిగతా రాష్ర్టాల్లో ఆర్థికమాంద్యం ప్రభావం ఎక్కువగా ఉందని కాగా మిగతా రాష్ర్టాల కన్నా తెలంగాణ పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. ఆర్థికమాంద్యం ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మంత్రుల కమిటీ నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎస్ పేర్కొన్నారు.