29.7 C
Hyderabad
May 2, 2024 06: 26 AM
Slider విజయనగరం

విజయనగరానికి నంది అవార్డు గ్రహీత.. ఏప్రిల్ 1న సంగీత విభావరి

#madhavapeddi

కళలకు కాణాచి అయిన విజయనగరానికి రెండు సార్లు “నంది” అవార్డులు అందు కున్న సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ రానున్నారు. ఈ విషయాన్ని శ్రీ గురు నారాయణ సంగీత కళా పీఠం నిర్వాహకులు  బి ఏ నారాయణ తెలిపారు. ఈ మేరకు విజయనగరం లో హోటల్ మయూర లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెబుతూ సంస్థ ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్ 1వ తేదీన విజయనగరం ఆనందగజపతి ఆడిటోరియంలో “మధురే సుధా గానం” పేరు తో సంగీత విభావరి ఏర్పాటు చేసామన్నారు. అదే రోజు సాయంత్రం నుంచీ సినీ ,లలిత, జానపద సంగీత విభావరి ఉంటుందని నారాయణ తెలిపారు. ఆ తర్వాత సంగీత దర్శకుడు సురేష్ ను కళాపీఠం తరుపున సన్మానించడం జరుగుతుందని అలాగే విజయనగరం కు చెందిన సినీ సంగీత నేపధ్య గాయని చే పాటల కార్యక్రమం జరుగుతుందని నారాయణ తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జమ్మూ శ్రీను మాట్లాడుతూ ఆ రోజు కార్యక్రమం చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు చివరి దాకా ఉంచేందుకు లక్కీ డ్రా పెట్టామని అందులో గెలిచిన వాళ్లకు బహుమతులు కూడా స్టేజ్ పైనే ఇస్తామని చెప్పారు.

Related posts

బీ కూల్ రోజమ్మ : అంతా నేనుచూసుకుంటానన్న జగన్

Satyam NEWS

ఫుల్లు జోష్ లో తెలంగాణ బిజెపి నాయకులు

Satyam NEWS

8 వేల స్కూళ్ల మూసివేతకు ప్లాన్

Satyam NEWS

Leave a Comment