చలో హైదరాబాద్ మాదిగల విశ్వరూప మహా బహిరంగ సభ సన్నాహక ప్రచార సభ ములుగు మండలం మదనపల్లి, జంగాలపల్లి గ్రామంలో MSP మహాజన సోషలిస్ట్ పార్టీ ములుగు టౌన్ అధ్యక్షులు మరాటి రవీందర్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ ప్రచార సభలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ములుగు జిల్లా కో ఇన్చార్జ్ ఏకు శంకర్ మాదిగ, మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ (MEF)ములుగు జిల్లా సమన్వయ కర్త /కోఆర్డినేటర్ నెమలి నర్సయ్యమాదిగ లు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలను సంఘటితం చేస్తున్నామని తెలిపారు.
30 లక్షల మాదిగలతో జరిగే మాదిగల విశ్వరూప మహా సభను విజయవంతం చేయాలని కోరారు. మాదిగ మాదిగ ఉపకులాల అభ్యున్నతి కోసం 29 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తూ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఏకైక లక్ష్యంగా ఉద్యమంలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అనాధ పిల్లల ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. గత ఐదారు నెలలుగా అనాధ పిల్లల పక్షాన ఉద్యమాలు నడిపిస్తూ మరొకసారి రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో నామ మాత్రపు ప్రకటన చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పుల్లూరి కరుణాకర్ మాదిగ MSP మహాజన సోషలిస్ట్ పార్టీ నేత జన్ను రవిమాదిగ తో పాటు మదనపల్లి గ్రామంలోని మాదిగ రక్త బంధువులందరు పెద్దయెత్తున పాల్గొన్నారు.