భోగి మంటలతో సంక్రాంతి పండుగ వైభవంగా ప్రారంభం అయింది. శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న ఏపిహెచ్బ్ బి కాలనీలో భోగి మంటలతో సందడిగా మారింది. స్థానిక కాలనీ వాసులు భోగి మంటల ముందు స్త్రీలు, పురుషులు, పిల్లలు డాన్స్ లు వేసి పండుగ వాతావరణాన్ని ఇనుమడింప చేశారు. ధాన్య లక్ష్మి ఇంటికి చేరిన వేళ అన్నదాన ఆనందంతో జరుపుకునే పండుగ భోగి. కొత్త వెలుగులు వచ్చే వేళ సంక్రాంతి పండుగ వాతావరణం మరింత వైభవంగా మారింది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేడ్ క్యాప్ కార్పొరేషన్ డైరెక్టర్ అలపాన త్రినాధ రెడ్డి, పీపుల్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు డా గంజి ఎజ్రా కాలనీ వాసులు మాధవరావు, జయప్రద, కోదండరావు, దీపిక, రాజు, భారతి, రాధాకృష్ణ, మాలిని, నాగేశ్వరరావు, లావణ్య పాల్గొన్నారు. ఆటపాటల్లో ఉత్సాహంగా కార్తీక, నేహ, గీతీక, అగస్త్య, గౌతమ్, చిన్ని, నీతూ, హరిప్రియ, రోషన్, సృజన, జాహ్నవి, దక్ష తదితరులు పాల్గొన్నారు.