మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్భుల్లాపూర్ మండల తహసీల్దార్గా పని చేస్తున్న ఎం.మహిపాల్రెడ్డి ఇదే జిల్లా మేడిపల్లి మండల తహసీల్దార్గా బదిలీ అయ్యారు.
ఇప్పటి వరకు మేడిపల్లి తహసీల్దార్గా, కాప్రా ఇంచార్జిగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్తేరు అనిత కాప్రా మండలానికి పూర్తిస్థాయి తహసీల్దార్గా నియమించారు.
ఈ మేరకు భాద్యతలు చేపట్టారు. మేడిపల్లి తహసీల్దార్ ఎం. మహిపాల్రెడ్డి మాట్లాడతూ ప్రజలకు ఎలాంటి జాప్యం లేకుండా ,అవినీతికి తావు ఇవ్వకుండా సేవలు అందిస్తామన్నారు.
ప్రభుత్వ ,అసైన్డ్ భూములు మరియు చెరువులు ఆక్రమణకు గురికాకుండా పరిరక్షిస్తామన్నారు.
సత్యం న్యూస్, ఉప్పల్