38.2 C
Hyderabad
April 29, 2024 12: 26 PM
Slider గుంటూరు

తెలుగుదేశం వాళ్లే మాపై దాడి చేశారు

#gopireddy

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పై తెలుగుదేశం పార్టీ నాయకుడు బుద్ధ వెంకన్న వంటి వారు రౌడీ మూకల తో దాడి చేయటం హేయమైన చర్య అని గుంటూరు జిల్లా నరసరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.

ఒకే అబద్ధం పదే పదే చెప్తే నిజం అయిపోదని, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారికి తప్పకుండా బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు ప్రయోగించిన భాష చాలా దారుణంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ‘ఏం మేం మాట్లాడలేమా ? మాకు బూతులు రావా ? కానీ మేం మీ అంత దిగజారిపోలేదు….మాకు సభ్యత, సంస్కారం ఉన్నాయి’ అని ఆయన అన్నారు.

Related posts

ఎలర్ట్: కామారెడ్డిపై పంజా విసిరిన కరోనా

Satyam NEWS

బీజేపీకి బీఆర్ఎస్ మినహాయింపు కాదు

Satyam NEWS

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో వైసీపీ ఎంపి భేటీ

Satyam NEWS

Leave a Comment