40.2 C
Hyderabad
May 2, 2024 17: 09 PM
Slider ప్రత్యేకం

వినాయకుడికి పూజలు చేసిన ముస్లిం అధికారిణి

#taslima

నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వినాయకుడికి ముస్లిం అధికారి  పూజలు చేశారు. ములుగు మండలం లోని రామచంద్రపూర్ పరిధిలోని మాన్సింగ్ తండా లో ప్రతాప్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి శుక్రవారం ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కొబ్బరి కాయ కొట్టి పూజలు చేశారు.

ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి,పంటలతో అందరు బాగుండాలని తస్లీమా మొక్కులు చెల్లించారు. అనంతరం గ్రామస్థులకు పులిహోర ప్యాకెట్లు,స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం వారు,భక్తులు ఉన్నారు.

Related posts

మంత్రి నిరంజన్ రెడ్డిని ఓడించాలి

Satyam NEWS

సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న చోట బిజెపి బలంగా ఉంటుంది

Satyam NEWS

హాజరు హో:లండన్ కోర్టులో విచారణకు విజయ్ మాల్యా

Satyam NEWS

Leave a Comment