నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వినాయకుడికి ముస్లిం అధికారి పూజలు చేశారు. ములుగు మండలం లోని రామచంద్రపూర్ పరిధిలోని మాన్సింగ్ తండా లో ప్రతాప్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి శుక్రవారం ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కొబ్బరి కాయ కొట్టి పూజలు చేశారు.
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి,పంటలతో అందరు బాగుండాలని తస్లీమా మొక్కులు చెల్లించారు. అనంతరం గ్రామస్థులకు పులిహోర ప్యాకెట్లు,స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం వారు,భక్తులు ఉన్నారు.