తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు రైతన్నలకు కన్నీళ్లు మిగులిస్తున్నాయి. ములుగు జిల్లాలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి, భారీగా వీ చి న గాలులకు ములుగు జిల్లాలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన మొక్కజొన్న పంట సుమారు 100 ఎకరాల మేర నేల కొరిగి పంట నష్టం జరిగింది. మల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రైతులు పోతనవేన సాంబయ్య రెండున్నర ఎకరాలు, మంద బిక్షపతి రెండున్నర ఎకరాలు, పోతనవేన ఐలు కొంరూ రెండెకరాలు, కూచిన వేన పోషాలు రెండెకరాలు కానుగంటి సతీష్ రెండెకరాలు మంద దేవయ్య రెండెకరాలు నూనెటి రాజు 4 ఎకరాలు ఇలా వివిధ రైతుల మొక్కజొన్న పంట చేతికి రావలసిన సమయంలో అకాల వర్షానికి దెబ్బ తినడంతో రైతులు విరవిలాడుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలని వేడుకుంటున్నారు.
previous post