తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అమరత్వంకు నేటికీ 75 ఏళ్ళు పూర్తయ్యాయని సిపిఎం రాష్ట్ర నాయకులు టి సాగర్ అన్నారు.
ఆదివారం రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి సభను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం , వెట్టిచాకిరి విముక్తి కోసం తన ప్రాణాలు తృణప్రాయంగా అర్పించారు అని అన్నారు. దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలని అన్నారు.
నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమంది పెట్టుబడిదారులకు మేలు కలిగించేందుకే దేశ సంపదను కారుచౌకగా పెట్టుబడిదారులకు అమ్మేస్తున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామ్ రెడ్డి సిపిఎం జిల్లా నాయకులు బాల్ రామ్, జోషి ,ఆంజనేయులు,దస్తప్ప, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.