ఆది శిలా క్షేత్రం మల్దకల్ శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో గద్వాల పట్టణంలోని షేర్ రెల్లివీధి చెవుల కాయ ఆంజనేయ స్వామి దేవాలయంలో హరి దాస శ్రేష్టుడైన శ్రీ పురందర దాసు ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి.
దేవాలయ వ్యవస్థాపక వంశీయులు ప్రహల్లాద రావు శేషాదుల వంశస్థులు ధీరేంద్ర దాస్ అర్చకులు ప్రాణేశాచార్యులు ఆధ్వర్యంలో దాసుల వారి ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు నిర్వహించి అనంతరం రథోత్సవంలో ఊరేగింపు నిర్వహించారు.
ఈ సందర్భంగా హరిదాసులు రచించిన పురందర కీర్తనలు ఆలపించారు. అలాగే దేవాలయంలో అమావాస్యను పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే ధరూర్ మండలం పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు ఆద్య కేశవాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాయచూరు, గద్వాల తదితర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో మధుసూధనాచారి, రమేష్ చారి, రాఘవేంద్రరావు, బాబురావు, శ్రీకాంత్, ముకుందరావు,వెంకోబ రావు, ్రావణ్, నాగరాజ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.