ములుగు జిల్లా లోని మల్లంపల్లి గ్రామ పచాయతీ పరిపాలన విజయవంతంగా రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సర్పంచ్ చంద కుమారస్వామి అధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఈ రెండు వసంతాలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై సర్పంచ్ చంద కుమారస్వామి పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ సీసీ రోడ్లు 1100 మీటర్లు ,800 మీటర్లు డ్రైనేజ్, స్మశాన వాటిక, సెగ్రేషన్ షేడ్, పల్లె ప్రకృతి వనాలు సుందరంగా తీర్చిదిద్దామని తెలియ చేశారు.
మాడల్ కాలనీ లో అంతర్గత రోడ్ల పై మట్టి పోయడం జరిగిందని తెలియజేశారు. అంతేకాకుండా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద కుమారస్వామి, ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి కొండల్ రెడ్డి, మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.