18.7 C
Hyderabad
January 23, 2025 03: 41 AM
Slider తెలంగాణ

స్టాటిట్యూటరీ వార్నింగ్: ప్రజలారా మంచి వాళ్లనే ఎన్నుకోండి

nagireddy

రాబోయే ఐదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయంగా పని చేసే నేతలను ఎన్నుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి పిలుపునిచ్చారు. రేపు జరగబోయే మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కి ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు. ఎన్నికల సందర్భంగా జరిగే పోలింగ్ ఏర్పాట్లలో 55 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని నాగిరెడ్డి తెలిపారు.

ప్రతి ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ధన ప్రభావం ఉందని ఫిర్యాదులు వచ్చాయని అయితే నిధుల పంపిణీని రాజకీయ పార్టీలే అడ్డుకోవాలని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు డబ్బులు పంపిణీ చేసి లెక్కలు చూపించకపోతే ఎన్నిక రద్దు చేస్తామని ఆయన అన్నారు.

Related posts

తమ పిల్లల ప్రవర్తన, అలవాట్ల పై తల్లిదండ్రులు కన్నేసి వుంచాలి

Satyam NEWS

పెద్దపాడు ఉన్నత పాఠశాలలో ఘనంగా న్యూ ఇయర్

Satyam NEWS

ఓట్ల కోసం దళితులతో ఆడుకుంటున్న సీఎం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment