టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రగొళ్ల మల్లేష్ యాదవ్ కు కొమురవెల్లి మల్లన్న దేవస్థానము బోర్డు మెంబర్ గా నియమితులైన సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి మల్లేష్ యాదవ్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం మల్లేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ ఆధ్వర్యంలో రవీంద్ర నగర్ కాలనీలో జరిగినది. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సాయి జన్ శేకర్, విటల్ యాదవ్, సంపత్ యాదవ్, శ్రీశైలం యాదవ్, బిక్షపతి యాదవ్, రామచందర్, తుంగ తిరుపతి, రవీందర్ రెడ్డి, అశ్వద్ధామ రెడ్డి, మారయ్య, కట్ట బుచ్చన్న గౌడ్, సువర్ణ, సుగుణాకర రావు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి