అనకాపల్లి జిల్లా, కశింకోట మండలం, పిసినీకాడ గ్రామములో నివాసం ఉంటున్న మొల్లేటి గణేష్, అరుణ దంపతుల చిన్న కుమారుడు భార్గవ్ గత ఐదు సంవత్సరాలనుండి గుండె, కాలేయ, రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. భార్గవ్ తండ్రి నిరుపేద. కూలి పని చేసుకొని భార్గవ్ కి చికిత్స చేస్తూ వస్తున్నారు.
అయితే అనిల్ నీరుకొండ హాస్పిటల్ వారు, బాబు గుండె కి ఆపరేషన్ చేస్తే బతుకుతాడు అని చెప్పడంతో… డబ్బులు లేక నిస్సహాయ స్థితిలో ఉండగా, ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మనం చారిటబుల్ ట్రస్ట్ వారు,భార్గవ్ ఆపరేషన్ కి విరాళాలు అడగటం , ఆ విరాలాలు సేకరణలో మరియు విరాళాలు ఇవ్వడంలో ఉపాధ్యాయ వర్గం ముఖ్య పాత్ర పోషించడం జరిగింది.
ఈ విధంగా వచ్చిన మొత్తము 20,000 మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బోదెపు గోవింద్, యలమంచిలి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అర్రెపు గుప్తా చేతుల మీదుగా భార్గవ్ తండ్రికి చెక్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనం చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ మురుకుర్తి గోపి, సెక్రటరీ పండూరి సురేష్, ట్రస్ట్ సభ్యులు కర్రి వీరు నాయుడు మాస్టారు, అనపర్తి మణి కుమార్, గారా సత్తిబాబు, సీతా వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.