40.2 C
Hyderabad
May 6, 2024 15: 40 PM
Slider ప్రత్యేకం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మంద కృష్ణమాదిగ భేటీ

#mandakrishnamadiga

కాలికి శస్త్ర చికిత్స అనంతరం నెల రోజుల విరామం తరువాత మంద కృష్ణ మాదిగ  కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డితో నేడు సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆయన హైదరాబాద్ డిడి కాలనీలోని తన నివాసంలో కృష్ణ మాదిగ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు.

ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మంద కృష్ణ మాదిగతో తనకు ఉన్న  అనుబంధాన్ని పాత్రికేయ మిత్రులకు తెలియజేసారు. అదే విధంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎంఆర్పిఎస్ ఉద్యమం పట్ల సానుభూతిని తెలిపారు. మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టి సారించాలని కోరారు.

త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని  విన్న వించారు. సీఎం కేసీఆర్ కూడా ఎస్సీ వర్గీకరణ పై తన మాటను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ జాతీయ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులతో పాటు అంబర్ పేట నియోజకవర్గ ఇంచార్జి బడుగుల బాలకృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా అదుపు కోసం ఫోరం ఫర్ బెటర్ విజయనగరం అవగాహన ర్యాలీ

Satyam NEWS

వనపర్తి జిల్లాలో కరోనా విజృంభణ

Satyam NEWS

జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ : సిఎంగా కేటీఆర్

Satyam NEWS

Leave a Comment