ప్రముఖ వాగ్గేయ కారుడూ ,సంగీత కళానిధి ,పద్మభూషణ్ డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతోత్సవం సందర్భంగా విజయనగరం మహారాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల యాజమాన్యం కచేరీలు నిర్వహించారు. ఈ మేరకు కళాశాల హాలులో డా.మంగళం పల్లి వారి విగ్రహానికి పూలదండ వేసి…కచేరీ ఇవ్వనున్న సంగీత కారులు…కళాశాల అధ్యాపకులు, విద్యార్ధినీ విద్యార్థులు అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రసన్న కుమారి మాట్లాడుతూ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 92వ జయంతి ఉత్సాహం.. కళాశాలలో నిర్వహించామని.. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత కచేరి లో డా.మండపాక శారద చే గాత్రం ,ఆమె చెల్లెలు అయిన డా.మండపాక నాగలక్ష్మి చే మృదంగంపై తమ ప్రతిభతో పలు కీర్తనలను.. సంగీత పాటలు పాడి…కళానిధి ని గుర్తు చేసుకున్నామని తెలిపారు.