సూపర్స్టార్ రజనీకాంత్ చెన్నైలోని తన ఇంటికి క్షేమంగా చేరారు.
రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ తర్వాత మూడు రోజుల పాటు అక్కడే ఉన్న సితార హోటల్ లో బస చేసిన ఆయన ఆరోగ్యం క్షీణించి అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
నేడు ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
రజనీకాంత్ కు చేసిన అన్ని పరీక్షల్లోనూ నార్మల్ వచ్చిందని, వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
కరోనా ప్రమాదం పొంచి ఉన్నందున ఎవరిని కలవవద్దని కూడా డాక్టర్లు సూచించారు.
రజనీ కాంత్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరి వెళ్లారు. కొద్ది సేపటి కిందట ఆయన తన నివాసానికి చేరుకున్నారు.