కొల్లాపూర్ ఎస్ ఐ జి.బాలవెంకట రమణ తండ్రి గొల్లఎల్ల నాగన్న (60) ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు పొలిమేరల్లోని వడ్డెమాను గ్రామానికి చెందిన నాగన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
నాగన్న చెట్టుకు ఉరివేసుకుని చనిపోయి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి వద్ద గోడ విషయంలో జరిగిన గొడవ కారణంగా తీవ్ర మనస్థాపం చెందిన నాగన్న ఈ సంఘటనకు పాల్పడినట్లు ఎస్ ఐ ఓబులేసు తెలిపారు.
నాగన్నకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు కొల్లాపూర్ ఎస్ ఐ గా పని చేస్తున్నారని ఓబులేసు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.