బాగ్ అంబర్ పేట్ డివిజన్లోని భరత్ నగర్ లో గత కొంత కాలంగా డ్రైనేజ్ మ్యాన్హోల్స్ సరిగ్గా లేని కారణంగా తరచుగా డ్రైనేజ్ ఓవర్ ఫ్లో తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్తీ ప్రజల విజ్ఞాపన మేరకు ఈ సమస్యను హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ డి జి యం సతీష్, మేనేజర్ కుశాల్ ల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు వెంటనే స్పందించి సమస్య తీవ్రంగా ఉన్నచోట కొత్త మ్యాన్హోల్ నిర్మింపచేశారు.
ఈ పనులను బిజెపి అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ ఏడేల్లి అజయ్ కుమార్ పర్యవేక్షించారు. ఈ మ్యాన్హోల్ నిర్మాణం చేపట్టిన అందుకుగాను భరత్ నగర్ బస్తీ ప్రజలు డీజీఎం సతీష్, మేనేజర్ కుశల్ లకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నభరత్ నగర్ బస్తీ యువజన నాయకులు ఈ భాస్కర్, శ్యామ్, ఏ సుధాకర్, రామ్, బాలు, వెంకటరమణ, శ్రీకాంత్, కమ్మ చిన్న, శీను తదితరులు పాల్గొన్నారు.