40.2 C
Hyderabad
May 6, 2024 15: 49 PM
Slider ముఖ్యంశాలు

కెసిఆర్ ప్రభుత్వంలో భారీ అవినీతి

#KCR government

కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడ చూసినా భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ

ఎమ్మెల్యేల దోపిడీ, అరాచకాలకు అడ్డులేదన్నారు. అడ్డుకున్న వారిపై బెదిరింపులకు పాల్పడుతూ అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. బహుజన రాజ్యం వస్తేనే బీఆర్ఎస్ నేతల అవినీతికి అడ్డుకట్టపడుతుందని, పేదల బతుకులు మారుతాయని పేర్కొన్నారు.

Related posts

రైతులను మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వం

Satyam NEWS

వీఆర్ఏలకు తక్షణమే వేతనం పెంచాలి….

Satyam NEWS

కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్

Bhavani

Leave a Comment