కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా కామారెడ్డి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో రైతులు పిటీషన్ దాఖలు చేశారు. తమను అడగకుండా మాస్టర్ ప్లాన్ చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల పిటీషన్ పై సోమవారం హైకోర్టు విచారణ జరపనుంది. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు 3 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్నా కూడా కలెక్టర్ కలవకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
previous post