సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా మఠంపల్లి, చౌటపల్లి గ్రామం నుంచి 150 మంది కార్యకర్తలు గట్టు శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో బిజెపి లో చేరారు. పార్టీలో చేరిన వారికి గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి పార్టీ క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల బిజెపి నాయకులు,కార్యకర్తలు,హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్ర బిజెపి నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్