32.2 C
Hyderabad
May 8, 2024 22: 07 PM
Slider నల్గొండ

మఠంపల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

#BJP Mathampally

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా మఠంపల్లి, చౌటపల్లి గ్రామం నుంచి 150 మంది కార్యకర్తలు గట్టు శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో బిజెపి లో చేరారు. పార్టీలో చేరిన వారికి గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి పార్టీ క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల బిజెపి నాయకులు,కార్యకర్తలు,హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్ర బిజెపి నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సంక్రాంతి సంబరాలు

Satyam NEWS

ఆర్‌‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తో సమావేశమైన తహసీల్దార్‌ బదిలీ

Satyam NEWS

కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

Satyam NEWS

Leave a Comment