మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్ బుదవారం చిల్కానగర్ డివిజన్ కళ్యాణపురలోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని అకస్మికంగా సందర్శించి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడతూ 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి వందశాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిచేసేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ ను సద్వినియోగం చేసుకో.ని కరోనా రహిత జిహెచ్ఎమ్సిగా తీర్చిదిద్దాలని తెలిపారు. వ్యాక్సిన్ బృందాలు తమకు కేటాయించిన కాలనీలకు ఉదయం 8 గంటలకు చేరుకుని వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పోరేటర్ బన్నాల గీతప్రవీణ్ముదిరాజ్, ఉప్పల్ సర్కిల్ డిప్యూటి కమీషనర్ అరుణకుమారి, ఈ ఈ నాగేందర్ , డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ముదిరాజ్ మరియు తెరాస నాయకులు ,కార్యకర్తలు తదితరలు పాల్గొన్నారు.