33.7 C
Hyderabad
April 29, 2024 01: 16 AM
Slider నెల్లూరు

కిలో బంగారం స్వాధీనం

gold

చెన్నైనుండి విజయవాడకు ఆర్టీసీ బస్సులో కిలో బంగారాన్నితరలిస్తున్నఇద్దరు వ్యక్తులను ఒంగోలు వద్ద డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం వీరిని విజయవాడలోని డీఆర్ఐ కార్యాలయానికి తరలించారు. అక్రమ బంగారు కొనుగోళ్ళ నేప‌థ్యంలో వీరు బంగారం ఎక్క‌డి నుంచి తీసుకువ‌స్తున్నారు, ఎక్క‌డికి తీసుకువెళుతున్నార‌నే విష‌యాల‌పై విచార‌ణ చేస్తున్నారు. చెన్నైనుండి బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన బంగారాన్ని తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పక్కా ప్రణాళికతో మాటువేసిన డీఆర్ఐ అధికారులు వీరిని ప‌ట్టుకున్న‌ట్లుగా తెలుస్తోంది. విచార‌ణ అనంత‌రం మ‌రిన్ని విష‌యాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Related posts

68 నామినేషన్ల తిరస్కరణ!

Sub Editor

బోనులో చిక్కిన చిరుత

Bhavani

సోనాలికా నుంచి టైగర్‌ డీఐ 75 4డబ్ల్యుడీ ట్రాక్టర్‌ విడుదల

Satyam NEWS

Leave a Comment