38.2 C
Hyderabad
April 29, 2024 13: 36 PM
Slider నిజామాబాద్

తీసుకున్న అప్పులు సకాలంలో చెల్లించాలి

#pulkal

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ప్రాంగణంలో సహకార సంఘం అధ్యక్షులు రామిరెడ్డి ఆధ్వర్యంలో మహాజన సభ  సోమవారం జరిగింది. ఈ సమావేశంలో కార్యదర్శి ఎం సాయి ప్రకాష్  అర్ధవార్షిక నివేదికను సభ ముందు నివేదించారు. సంఘం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, దీర్ఘకాలిక అప్పులు, విత్తనములు ఎరువులు, విక్రయాలతో పాటు వరి ధాన్యం, సెనగ, మొక్కజొన్న కొనుగోలు తదితర అంశాలను ఈ సమావేశంలో వివరించారు. ఈ సంవత్సరంలో సంఘ సభ్యులకు స్వల్పకాలిక అప్పులు 11,48,775రూపాయలు, పంపిణీ చేయడం జరిగిందన్నారు.

అనంతరం  సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన వ్యాపార వివరాలను ఆయన చదివి వినిపించారు. సంఘానికి రావలసిన కమిషన్లు మొత్తం76,17,591 రూపాయలు రావలసినవి ఉన్నాయన్నారు. అనంతరం అధ్యక్షులు రామిరెడ్డి మాట్లాడుతూ అప్పు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించి సంఘ అభివృద్ధికి సహకరించి సంఘాన్ని మరింత అభివృద్ధి చెందే దిశగా సహకరించాలన్నారు. కార్యక్రమంలో చైర్మన్ తో పాటు పాలకవర్గ సభ్యులు,కార్యదర్శి,సంఘ పరిధిలోని వాజిద్ నగర్, గుండె నెమలి,బండ రెంజల్,ఎల్లారం, సిరిసముందర్,పెద్ద దేవాడ, చిన్న దేవాడ, పెద్దదడిగి,చిన్నదడిగి గ్రామాల రైతులు పాల్గొన్నారు.

జి లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

ధ్వని మోషన్ పోస్టర్ ప్రయోగాత్మకంగా ఉంది గెటప్ శ్రీను !!!

Satyam NEWS

దళితులు కాంగ్రెస్ పార్టీకి రక్షణగా ఉండాలి

Satyam NEWS

మోడీ విధానాలు త్రిప్పి కొట్టెందుకే….27 భారత్ బంద్….!

Satyam NEWS

Leave a Comment