40.2 C
Hyderabad
April 29, 2024 17: 25 PM
Slider విజయనగరం

మోడీ విధానాలు త్రిప్పి కొట్టెందుకే….27 భారత్ బంద్….!

#cpmvijayanagaram

మోడీ రెండవ సారి అధికారం లోకి వచ్చాక దేశాన్ని కార్పొరేట్ శక్తలకు తెగ నమ్మేస్తున్నాడని బీజేపీ నుండి దేశాన్ని రక్షించేందుకు ప్రజలు సిద్ధమవాలని సీపీఎం నగర కార్య దర్శి రెడ్డి శంకరరావు ప్రజలకు పిలుపు నిచ్చారు.ఈ నెల 27దేశ వ్యాప్త  బార‌త్ బంద్ నేప‌ధ్యంలో  అందులో  సీపీఎం పాల్గొన‌బోతోంది.

ఈ మేర‌కు ఆ  బంద్ ప్రచారం లో పాల్గొన్న రెడ్డి శంక‌ర‌రావు మాట్లాడుతూ మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు పై ప్రచార కార్యక్రమం సీపీఎం  చేపట్టింది.అందులో భాగంగా విజయనగరం  లో లంకా పట్టణం లో డాబా తోట కలాసీలు.. తో సభ జరిగింది.ఆ సభ నుద్దేశించి శంకర రావు మాట్లాడుతూ  ప్రజల అస్తులైన ప్రభుత్వరంగసంస్థల నీ అరు లక్షల కోట్లకు ప్రైవేట్ కంపెనీల కు తాకట్టు పెట్టడం అత్యంత దుర్మార్గమని ఆరోపించారు..

ఆ అదికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని. కేవలం మోడీ అనుచరు లైన అంబానీ.. ఆధానీ లకు కట్టబెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం టాటా స్టీల్ కంపెనీ కి అమ్మేందుకు సిద్ధమౌతున్నారు. అంతేకాదు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయ‌ని…. విద్యా. విద్యుత్ ప్రైవేటు వాళ్ళ చేతిలోకి పోయాయని విమ‌ర్శించారు..

ఇప్పుడు పేద. మధ్య తరగతి ప్రజలకు ఆ నిత్యావ‌స‌ర‌స‌రుకుల ద‌ర‌లు అందుబాటులో లేకుండా పోయాయని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.. వైద్యం ఖ‌రీదుగా మారింద‌ని… ఉపాధి అవకాశాలు కూడా  లేవని రెడ్డి శంక‌ర‌రావు అన్నారు.. ఏడాధి కి 2 కోట్ల వుధ్యోగాలు ఇస్తామన్న మోడీ ఉన్న ఉద్యోగాలు ఊడ పీకేస్తున్నాడని సీపీఎం ఆరోపించింది.. కావున దేశ రక్షణ కోసం మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు త్రిప్పి కొట్టేందుకు ప్రజలంద‌రూ సిద్ధం కావాలని అందు కు జరిగే భారత్ బందు లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బి రమణ ,త‌దితరులు పాల్గొన్నారు.

Related posts

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో గురు పౌర్ణమి సీతారాముల కల్యాణోత్సవం…

Bhavani

ఏపీలో క‌లెక్ట‌ర్లు,ఎస్పీలు మార‌డం ఖాయ‌మంట‌…?

Satyam NEWS

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై పోలీసు కేసు నమోదు

Satyam NEWS

Leave a Comment