పాఠశాలల్లో పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛా పూరిత వాతావరణంలో విద్యా బోధన కొనసాగేలాగా చూడాలని ప్రొటెక్షన్ అధికారి మీరా కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల విద్యాధికారి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
బి ఆర్ బి కోఆర్డినేటర్ వెంకట్ లక్ష్మి మాట్లాడుతూ ఉపాధ్యాయులు పిల్లలతో స్నేహితులుగా ఉండాలని అన్నారు. మండల అధికారి శత్రునాయక్ మాట్లాడుతూ పిల్లలందరూ చదువుల పట్ల శ్రద్ధ వహించాలని,దీనికి తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సోమమ్మ,వసంత,డిఆర్ డిఎ సిబ్బంది సాయమ్మ,చైల్డ్ లైన్ సపియా,మల్లేష్ పాల్గొని పిల్లల సంరక్షణ పోస్టర్ లను ఆవిష్కరించారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్