సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మన ఊరు – మన బడి కార్యక్రమంలో పాఠశాలల ఎంపిక పునః పరిశీలన చేయాలని, నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు సబితా ఇంద్రా రెడ్డిని సత్తుపల్లి సండ్ర వెంకటవీరయ్య కలిశారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో పాఠశాలల ఎంపిక, పాఠశాలలోని విద్యార్థుల నిర్ణీత సంఖ్య ఆధారంగా జరిగినప్పటికీ కొన్ని తప్పిదాల కారణంగా అర్హత కలిగిన కొన్ని పాఠశాలలను ఎంపిక చేయలేదని, కావున ఈ ఎంపిక ప్రక్రియను పున పరిశీలన చేయాలని, సత్తుపల్లి జూనియర్ కళాశాల రేకుల పైకప్పుతో శిథిలావస్థకు చేరినందున నూతన బిల్డింగ్ మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పలు పాఠశాలలో అదనపు తరగతి గదులు అవసరం ఉన్నందున నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. దీనికి మంత్రి సబిత సానుకూలంగా స్పందించారు.
previous post
next post