31.2 C
Hyderabad
May 3, 2024 02: 24 AM
Slider హైదరాబాద్

సబితని కలిసిన సండ్ర

sandra meets sabita

సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మన ఊరు – మన బడి కార్యక్రమంలో పాఠశాలల ఎంపిక పునః పరిశీలన చేయాలని, నియోజకవర్గంలోని పలు  పాఠశాలల్లో  సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు సబితా ఇంద్రా రెడ్డిని సత్తుపల్లి సండ్ర వెంకటవీరయ్య కలిశారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో పాఠశాలల ఎంపిక, పాఠశాలలోని విద్యార్థుల నిర్ణీత సంఖ్య ఆధారంగా జరిగినప్పటికీ కొన్ని తప్పిదాల కారణంగా అర్హత కలిగిన కొన్ని పాఠశాలలను ఎంపిక చేయలేదని, కావున ఈ ఎంపిక ప్రక్రియను పున పరిశీలన చేయాలని, సత్తుపల్లి జూనియర్ కళాశాల  రేకుల పైకప్పుతో శిథిలావస్థకు చేరినందున నూతన బిల్డింగ్ మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలోని  పలు పాఠశాలలో అదనపు తరగతి గదులు అవసరం ఉన్నందున నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. దీనికి మంత్రి సబిత సానుకూలంగా స్పందించారు.

Related posts

కెనడాలో TDF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ

Satyam NEWS

రఘురామను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచవద్దు

Satyam NEWS

పాపాల భైరవుడు కేసీఆర్ కు కాలం చెల్లింది

Satyam NEWS

Leave a Comment