40.2 C
Hyderabad
April 29, 2024 15: 26 PM
Slider హైదరాబాద్

కేటీఆర్ పుట్టిన రోజున మాగంటి మెగా రక్తదాన శిబిరం

#Maganti Gopinath

రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి, తెలంగాణ ఆశాజ్యోతి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా భారీ ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వెల్లడించారు. ఈ నెల 24వ తేదీన యూసుఫ్ గూడాలోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియం లో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన సత్యం న్యూస్ కు తెలిపారు.

కరోనా లాక్ డౌన్ సందర్భంగా రక్త దాతలు రాలేకపోవడం వల్ల వేలాది మంది రక్తం అవసరం ఉన్న తలసేమియా వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతున్న తరుణంలో మంత్రి కేటీఆర్ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారని, ఆ నాటి నుంచి తమ పార్టీ కార్యకర్తలు క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్నారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు.

మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇచ్చిన పిలుపును గుర్తు చేసుకుంటూ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గోపీనాథ్ వెల్లడించారు. రక్తం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మొత్తం 3 వేల మంది రక్తదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే గోపీనాథ్ తెలిపారు.  

Related posts

ఉచిత శిక్షణ అర్హత కోసం 24న బిసి ఓసి మైనారిటీ అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష

Satyam NEWS

అనాధల రాత మారుస్తానంటున్న”గీత”

Satyam NEWS

ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసు పైశాచికత్వం

Satyam NEWS

Leave a Comment