42.2 C
Hyderabad
April 30, 2024 15: 19 PM
Slider హైదరాబాద్

మంత్రి కేటీఆర్ పుట్టిన రోజున మెగా రక్తదాన శిబిరం

#maganti gopinath

టి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని యూసఫ్ గూడా లో ఉన్న కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. జులై 24న ఉదయం ఈ మెగా రక్తదాన శిబిరం ప్రారంభిస్తున్నట్లు జూబ్లీహిల్స్ శాసన సభ్యులు మాగంటి గోపీనాథ్ ‘సత్యం న్యూస్ ’ కు తెలిపారు.

రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిధుల కొరత ఉన్నందున ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. చాలా చోట్ల తలసేమియా సికిల్ సెల్స్ వ్యాధి పీడితులు రక్తం అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

వారికి తరచూ రక్తం మార్చాల్సిన అవసరం ఉన్నందున వారిని ఆదుకోవడానికి రక్తదానం మహాదానం అవుతుందని మాగంటి గోపీనాథ్ తెలిపారు.  గతంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాలు విజయవంతం అయ్యాయని అందువల్ల కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేదీప్య విజయ్, సి. ఎన్. రెడ్డి, రాజ్ కుమార్ పటేల్ మరియు తలసేమియా & సికిల్ సెల్ సొసైటీ ప్రతినిధులతో కలసి పరిశీలించారు.

Related posts

వి.ఆర్.ఎ ల న్యాయమైన పోరాటానికి ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు

Satyam NEWS

మైండ్ గేమ్ టు ఎండ్ గేమ్ వయా బ్లైండ్ గేమ్

Satyam NEWS

వ్యక్తి ఆరాధనకు పరాకాష్ట: దుర్గా మాత పక్కన దీదీ విగ్రహం

Satyam NEWS

Leave a Comment