37.2 C
Hyderabad
May 2, 2024 11: 42 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో పేదల పెన్నిధి  మెగా రెడ్డి

#megareddy

వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల పరిధిలోని నాగసానిపల్లి  గ్రామంలో  బోరెల్లి ఎల్లయ్య  అనారోగ్య సమస్యతో  చనిపోయారు. వారి కుటుంబ పరిస్థితి ఇబ్బందిగా ఉందని మేఘారెడ్డి యువసేన సభ్యులు గంధం రంజిత్ కుమార్,  శ్రీ హరి, రాజు ప్రజానేత మేఘారెడ్డి దృష్టికి తీసుకువెల్లగా స్పందించిన నియోజకవర్గ నేత మేఘారెడ్డి బోరెల్లి ఎల్లయ్య  భార్య శంకరమ్మ కుటుంబానికి  10,000/-(పది వేలు) రూపాయలను  నాగసానిపల్లి గ్రామంలో శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు గంధం రంజిత్ కుమార్, పెబ్బేరు టౌన్ ఉపాధ్యక్షుడు గంధం సునీల్, శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ గౌరవ అధ్యక్షుడు ఈశ్వరయ్య, శ్రీరంగాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న గౌడ్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్  శ్రీహరి రాజు, శంకర్ నాయుడు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు భీమన్న, మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి  జె. ఆశన్న,సింగల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, నాగసాని పల్లె గ్రామ అధ్యక్షుడు రాజేందర్, లక్ష్మణ్ నాయుడు, జి శ్రీనివాసులు, బి రాముడు,జి కురుమయ్య, జయ రాములు, వెంకటాపూర్ గ్రామం నుండి మహేష్, శివకుమార్, ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కె. రాము, బి. వెంకటయ్య, రాముడు, నరేష్ కుమార్ పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

పోలీసుశాఖ ప్రతిష్ట పెంచేలా విధినిర్వహణ ఉండాలి

Satyam NEWS

టీచర్స్ బదిలీలపై హైకోర్టు విచారణ

Bhavani

ఫిబ్ర‌వ‌రి 1న రథసప్తమికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment