టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లిన వనపర్తి నియోజకవర్గ నేత, పెద్దమందడి మండల పరిషత్ అధ్యక్షుడు తూడి మేఘారెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో గెలుపు ద్యేయంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లురవి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు,నాగర్ కర్నూలు నేతలు దామోదర్ రెడ్డి,రాకేష్ రెడ్డి, సాయి చరణ్ రెడ్డి పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్.నెట్