38.2 C
Hyderabad
April 29, 2024 20: 20 PM
Slider శ్రీకాకుళం

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

#SrikakulamCongress

కార్పొరేట్ కంపెనీలకు తొత్తుగా మారిన కేంద్ర ప్రభుత్వం, వారికి అనుకూలంగా వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనుబంధ విభాగమైన స్టేట్ హ్యూమన్ రైట్స్  చైర్మన్ చైర్మన్ ఎం రాజశేఖర్ ఆరోపించారు.

 ఆయనతో బాటు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి పి వై కె కిరణ్ కుమార్ నేడు శ్రీకాకుళం లోని ఇందిరా విజ్ఞాన్ భవన్ లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

కేంద్ర ప్రభుత్వం  రైతు వెన్నెముక విరిచే విధంగా వ్యవసాయ చట్టం తెచ్చిందని అన్నారు. రైతు జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్నారని అన్నారు.

ఈ అంశంపై ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో రెండు కోట్ల సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు.  

వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించేందుకు కార్యక్రమం  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం చాలా దుర్మార్గం అని ఆయన అన్నారు.

గత ప్రభుత్వాలు ఉచిత కరెంటు ఇస్తే ఈ ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి రైతులను నిర్వీర్యం చేయాలని చూస్తుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు గోవింద మల్లి బాబు, డిసిసి సెక్రటరీ బైరి రాజేష్ పాల్గొన్నారు.

Related posts

తుడా సెక్రటరీగా జి.వెంకట నారాయణ బాధ్యతలు స్వీకరణ

Satyam NEWS

రామ‌చంద్ర మిష‌న్ నూత‌న కేంద్రం ప్రారంభం

Satyam NEWS

సెప్టెంబర్ 6న అంజలి,ఆండ్రియాల తారామణి

Satyam NEWS

Leave a Comment