కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం బూత్ స్థాయిలో విస్తృతంగా ప్రచారాలు నిర్వహించాలని జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ బూత్ లెవల్ ఏజెంట్లకు దిశా నిర్దేశం చేశారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో మధిర నియోజకవర్గ పరిధిలో చింతకాని, ముదిగొండ మండలాల బూత్ లెవెల్ ఏజెంట్ల సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలాల్లో పది బూత్ లను కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసుకోవాలని ఒక్కో క్లస్టర్ కు ఒక కన్వీనర్ ను నియమించాలని తెలిపారు. బూత్ లెవల్ ఏజెంట్లను సమన్వయ పరుచుకుంటూ ప్రతి గడపకు కాంగ్రెస్ కార్యాచరణ ఏంటో ప్రజల్లోకి చేరవేయాలని సూచించారు. వరంగల్ రైతు డిక్లరేషన్, మంచిర్యాల యూత్ డిక్లరేషన్ అంశాలను ప్రజల్లోకి తీసుకెల్లేల బూత్ స్థాయి ఏజెంట్లు, కన్వీనర్లు కృషి చేయాలని తెలిపారు.
ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ పోరాటంతోనే నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు జిల్లా పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ బూత్ ల ఇంచార్జి వడ్డే నారాయణరావు, చింతకాని, ముదిగొండ మండలాల బూత్ ఇంచార్జ్ లు , అంబటి వెంకటేశ్వర రావు, కందుల వీరబాబు,మాజీ ZPTC పసుపులేటి దేవేంద్రం,మట్టా రవీందరరెడ్డి,మహ్మద్ అజఘర్,బొర్రా ప్రసాద్,మల్లెలఅజయ్,కన్నెబోయిన గోపి,బందెల నాగార్జున,సట్టు వెంకటేశ్వర్లు మరియు ముదిగొండ,చింతకాని మండలాల బూత్ ఏజెంట్ లు పాల్గొన్నారు.