గత పదేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు ప్రపంచ దేశాల్లోని కోట్లాది మంది తెలుగు ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్న “మెట్రో టీవీ” యాజమాన్యం అత్యంత ఆకర్షణీయమైన రంగుల్లో రూపొందించిన 2020 క్యాలెండర్ ను సోమవారం అనంతపురము జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆవిష్కరించారు.
క్యాలెండర్ మొత్తం పరిశీలించిన కలెక్టర్ చాలా ఆకర్షణీయంగా ముద్రించారని, ఛానెల్ యాజమాన్యాన్ని, సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్-1 ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్-2 రామమూర్తిలతో పాటు ఆయా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, మెట్రో టీవీ రాయలసీమ ఇంచార్జి టి మద్దిలేటి, అనంతపురం జిల్లా ఇంచార్జి నాగేంద్ర, హిందూపురం పార్లమెంట్ ఇంచార్జి ఎం.క్రిష్టప్ప, కర్నూలు రిపోర్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.