ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రం లో భద్రాచలం లో…ఏపీలో రామతీర్ధంలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. ఈ మేరకు విజయనగరం జిల్లాలో రామతీర్ధం లో కల్యాణ మండపంలో రాములోరి కల్యాణం జిల్లా యంత్రాంగం తరుపున దేవస్థానం నిర్వహించింది. ఈ సందర్భంగా సింహాచలం నుంచీ తీసుకొచ్చిన పట్టు వస్త్రాలను మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు సమర్పించారు. మంత్రి బొత్స తో పాటు నెల్లిమర్ల ఎంఎల్ఏ బడుకొండ అప్పలనాయుడు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఎంఎల్సీ సూర్య నారాయణ రాజు,రామతీర్ధం దేవస్థానం ఈఓ కిషోర్ కుమార్ తదితరులు ఉన్నారు