రాష్ట్ర విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అయిదు రోజుల పాటు విజయనగరం లో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా పౌర సంబంధాల ,సమాచార శాఖ ..మంత్రి బొత్స… పర్యటన షెడ్యూల్ ను తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి తన నివాసానికి చేరుకుంటారు. 10-30 గంటలకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 8వ తేదీ శనివారం ఉదయం 11-00 గంటల నుంచి నగరంలో నిర్వహించే శంకుస్థాపన మహోత్సవాల్లో పాల్గొంటారు. 9వ తేదీ ఆదివారం తన నివాసంలో వుంటారు. 10వ తేదీ ఉదయం 10-30 గంటలకు వల్లంపూడి లో, సాయంత్రం 4 గంటలకు గుర్ల మండలం పకిరికిట్ల లో గ్రామ సచివాలయం భవనాలను విద్యా శాఖ మంత్రి ప్రారంభిస్తారు.11వ తేదీన ఉదయం 11-00 గంటలకు ప్రజా రవాణా శాఖ ఆధ్వర్యంలో రాజాంలో నిర్మించనున్న ఆర్టీసీ బస్సు స్టాండ్ కు శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2-00 గంటలకు విశాఖ చేరుకొని విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు.
previous post