38.2 C
Hyderabad
May 2, 2024 19: 57 PM
Slider విజయనగరం

22 నుంచి 4 రోజుల‌ పాటు మంత్రి బొత్స సొంత జిల్లా పర్యటన

#BotsaSatyanarayana

ఏపీ ‌రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఈనెల 22న జిల్లాకు రానున్నారు. ఈనెల 25 వ‌ర‌కు మంత్రి జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

మంత్రి బొత్స ఈ నెల‌ 22న మ‌ధ్యాహ్నం వంటి గంట‌కు విశాఖ చేరుకొని అక్క‌డి నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు విజ‌య‌న‌గ‌రం చేరుకుంటారు.

ఆ మ‌ర్నాడు..23న‌ ఉద‌యం 9-00 గంట‌ల‌కు సీఎం ప‌ట్టాలు పంపిణీ చేయ‌నున్న‌ గుంక‌లాం స‌భాస్థ‌లిని ప‌రిశీలిస్తారు.

అదే రోజు క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌‌తో సి.ఎం. ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌పై స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

ఆ వెంట‌నే గ‌జ‌ప‌తిన‌గ‌రంలో ఒక ప్రైవేటు కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు. అలాగే 11-30 గంట‌ల‌కు అక్క‌డే.. నిర్మించ‌నున్న వంద ప‌డ‌క‌ల ఆసుప‌త్రికి  మంత్రి బొత్స‌ శంకుస్థాప‌న చేస్తారు.

అక్క‌డ నుంచీ.మ‌ధ్యాహ్నం 3-00 గంట‌ల‌కు బొండ‌ప‌ల్లి మండ‌లం త‌మ‌టాడ‌లో వై.ఎస్‌.ఆర్‌. జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూహ‌క్కు- భూర‌క్ష ప్రాజెక్టును ప్రారంభిస్తారు.

ఇక  24న ఉద‌యం 11 గంట‌ల‌కు సాలూరు చేరుకొని అక్క‌డ నిర్మించ‌నున్న 100 ప‌డ‌క‌ల ఆసుప‌త్రికి మంత్రి బొత్స‌  శంకుస్థాప‌న చేస్తార‌ని తెలిపారు.

అదే రోజు సాయంత్రం లీ పార‌డైజ్ ఫంక్ష‌న్ హాలులో జ‌రిగే ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు.తిరిగి 25న ఉద‌యం 11 గంట‌ల‌కు చీపురుప‌ల్లిలో ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొని…. 12 గంట‌ల‌కు కెజిబివి స్కూల్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేస్తార‌ని  జిల్లా కలెక్ట‌ర్ డా.హ‌రి జ‌వహ‌ర్ లాల్ తెలిపారు.

Related posts

అదనపు కలెక్టర్ గా వచ్చి… ఆయనే కలెక్టర్ గా మారి…

Satyam NEWS

ఇడుపులపాయలో విద్యార్ధి ఆకస్మిక మృతి

Bhavani

ఉజ్జయిని మహంకాళి జాతరకు భారీ బందోబస్తు

Satyam NEWS

Leave a Comment