ఏపీ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈనెల 22న జిల్లాకు రానున్నారు. ఈనెల 25 వరకు మంత్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మంత్రి బొత్స ఈ నెల 22న మధ్యాహ్నం వంటి గంటకు విశాఖ చేరుకొని అక్కడి నుండి రాత్రి 7.30 గంటలకు విజయనగరం చేరుకుంటారు.
ఆ మర్నాడు..23న ఉదయం 9-00 గంటలకు సీఎం పట్టాలు పంపిణీ చేయనున్న గుంకలాం సభాస్థలిని పరిశీలిస్తారు.
అదే రోజు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సి.ఎం. పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారు.
ఆ వెంటనే గజపతినగరంలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరవుతారు. అలాగే 11-30 గంటలకు అక్కడే.. నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రికి మంత్రి బొత్స శంకుస్థాపన చేస్తారు.
అక్కడ నుంచీ.మధ్యాహ్నం 3-00 గంటలకు బొండపల్లి మండలం తమటాడలో వై.ఎస్.ఆర్. జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష ప్రాజెక్టును ప్రారంభిస్తారు.
ఇక 24న ఉదయం 11 గంటలకు సాలూరు చేరుకొని అక్కడ నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రికి మంత్రి బొత్స శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
అదే రోజు సాయంత్రం లీ పారడైజ్ ఫంక్షన్ హాలులో జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరవుతారు.తిరిగి 25న ఉదయం 11 గంటలకు చీపురుపల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని…. 12 గంటలకు కెజిబివి స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్ తెలిపారు.