ఈనెల 29,30 తేదీల్లో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన విజయవాడ నుంచి బయలుదేరి 28 సాయంత్రమే జిల్లాకు చేరుకుంటారు. శనివారం ఉదయం 10 గంటలకు విజయనగరంలోని తమ ఇంటి నుంచి బయలుదేరి, 11 గంటలకు బొబ్బిలి సమీపంలోని పిరిడి వద్ద, తోటపల్లి రిజర్వాయర్ పేకేజ్-1 పనులకు శంకుస్థాపన చేస్తారు. రాత్రి విజయనగరంలోనే బస చేస్తారు. తిరిగి 30వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఇంటివద్దనుంచి బయలుదేరి, 11 గంటలకు జిల్లా లోని పాచిపెంట మండలం గురివినాయుడిపేట వద్ద, పెద్దగెడ్డ రిజర్వాయర్ అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్తారు