వర్దన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో కురుస్తున్న వర్షానికి వరద నీటితో ముంపు గురైన ప్రాంతాలను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే అరూరి రమేష్ , జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు.
బాధితులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముంపుకు గురైన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. తక్షిణ సహాయంగా మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేష్ బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.